Sunday, February 27, 2011

ఎవడబ్బ సొమ్మని

ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా
అనే పాట ఇప్పుడు ... అందరు పాడుకునే సమయం వచ్చింది..

మొదట... కోట్ల తో మొదలు అయిన అవినీతి
తరువాత పదులు, వందల కోట్లకు పెరిగి..
అక్కడితో ఆశ తీరక,  ఆనందము  చాలక
అది కాస్తా..... వేల కోట్లకు పాకింది..
అది కాస్త ఊహించని రీతిలో పెరిగి పెద్దవయి.. మనకు

లక్షల కోట్ల  విలువ  చేసే   అవినీతి కుంభకోణాల రూపంలో వెలుగు చూస్తున్నాయి ..
ఈ కుంభకోణాలు దేశ భావిష్యత్హు, దేశ ప్రతిస్తకు సంబంధించిన విషయాలకు సంభందించిన స్కాములు ఇవి.. 

మనందరికీ  తెలుసు .. ఈ దోచిన డబ్బులు ఎక్కడికి వెల్తున్నాయో ... 

ఎవరెవరికి చేరు తున్నాయో..
అవి  పెట్టుబడుల రూపంలో మన దేశంలోకి ఎలా వస్తున్నాయో..
ఆ వేలు మరియు లక్షల కోట్లతో వాళ్ళు ఏమి చేస్తున్నారో..

ఇన్ని జరుతున్న కాని 
విదేశీ బ్యాంకుల్లో వేల , లక్షల కోట్ల అవినీతి డబ్బు దాగుందని తెలిసినా.. 
మన దేశ ప్రజలది అంటే మనందరిదీ ఏమీ చేయలేని దయనీయ పరిస్థితి...


మనం చదువుకున్న పుస్తకాలలో..

లేదా సినిమాలలో.. కామన్ డైలాగ్ ఏంటంటే ...
"అవినీతిఫై  శంఖం పూరించడం"..
.
అప్పట్లో.. 

శంఖం ద్వార వచ్చే శబ్ద  పరిధిలో మాత్రమే అవినీతి వుండేదేమో అని.. కవి అర్థం కాబోలు..
అందుకు ఈ వాక్యాన్ని, తరచుగా కవులు వాడేవారేమో..
ఇప్పుడూ.. అవినీతి హద్దులు ఎల్లలు హద్దులు దాటి .. 

వందలు, వేలు, లక్షల  శంఖాలు  పూరిస్తే  కూడా ఆ శభ్ధం చేరలేనంత  హద్దులు ఈ అవినీతికి పెరిగాయి..

ఇప్పుడూ మనం మహాత్ముడు చెప్పిన ఒక సూక్తి గుర్తు చేసుకోవాలి..
 "“Earth provides enough to satisfy every man's need, but not ONE man's greed"
ప్రతి మనిషికి సంతోషంగా ఉండడానికి కావాల్సిన వనరులున్నీ ఈ భూమాత దగ్గర వున్నాయి.. కాని ఒక్క  మనిషి అత్యాశకు సరిపోయినన్ని వనరులు లేవు    అని..
ఆయన్న చెప్పిన మాటల్లోని భావం అర్థం చేసుకుంటే మనకు అర్థమయిపోతుంది.. ఎందుకు అమెరికా ఇరాక్ ఫై యుద్ధం చేసిందో...  మనిషి అవినీతిఫై అవినీతి ఎందుకు చేస్తున్నాడో..

ఈ అవినీతికి వున్న పెద్ద జాడ్యం ..
ఆ అవినీతిని.. ఇంకొంచం పెంచడం..
ఎలాగంటే ఒక అవినీతిపరుడు.. కొన్ని వేల కోట్లని దోచి... ఆ వేలకోట్లనుంచి.. ఇంకొన్ని కోట్లను సంపాదించే ఉద్దేశ్యంతో..
ఇంకా ఎంతోమందిని అవినీతి పరుల్ని తయారు చేస్తుంటాడు...
మనం గమనిస్తే...
ఒక అవినీతి పరుని దగ్గర పని చేసే వాళ్ళలో .. తొంబై శాతం మంది.. అవినీతి పరులే వుంటారు...
అది అవినీతికి వున్నా మహా  శక్తి..

అంతేకాకుండా...


ఈ అవినీతికి నీతిని బలహీనపరిచే శక్తి వుంది... అందుకే మనం నీతిగా వెళ్తే పనులు జరగవు అని మన మనసుకి సర్ది చెప్పుకుంటుంటాము
అందుకేనేమో  ..
మనమెప్పుడు.. అవినీతిపరులకే పెద్ద ఫాన్స్..
రైట్ హాండ్స్ .. లెఫ్ట్ హాండ్స్..
దగ్గర బంధువులం..
ఇంకా చెప్పాలంటే.. ఆత్మ బంధువులం..
ఎలా గంటె...  ఉదాహరణకు ...
ఒక రైతు  ఉన్న  ఊరిలోనే... కొంతమంది..రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు... పంట డబ్బు కొరకో ... కరువుభత్యం చిక్కకో... ఆ రైతుకు...సాటి రైతు చనిపోయాడని బాధ పెద్దగ వుండదేమో... ఎందుకంటే దానికి కారణమైన నాయకునికే   వోటు  వేస్తాడు... ఎందుకు... ఆ అవినీతిపరునికి... ఆత్మ బంధువు కావట్టి..
అలాగే  పక్క వూరిలో..రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు .. ఇప్పుడు.. ఈ నాయకుడు.. ఆ వూరి నాయకుణ్ణి.. నిందిస్తాడు.. ఇప్పుడు.. ఇక్కడి వ్యక్తికి 
... అభిమానం పొంగి వచ్చి.. తన వూరి నాయకుణ్ణి  నెత్తిన పెట్టుకుంటాడు...

ఇలాంటి సంఘటనలు ... ఒక్క రైతుల విషయంలోనే కాదు..
అన్నీ వర్గాలు, కులాలు, కార్మికుల విషయంలో జరుగుతున్నాయి..

లేకపోతే .. ఇటువంటి మోసాలు చేసిన నాయకులెందరో మల్లీ మల్లీ ఎందుకు ఎన్నికవుతున్నారు

ఒక్కటి మాత్రం నిజం..
ఈ అవినీతి కట్టె  కాస్త ఇప్పుడూ పెద్ద అడవి అయి  కూర్చుని వుంది..
ఈ అడవిని కాల్చాలంటే.. చిన్న నిప్పు చాలదు.. ఒక కార్చిచ్చు కావలసిందే..
ఎంతటి కార్చిచ్చు కావాలంటే..
మనము అనుకుంటున్న  మూడు కోట్ల మంది దేవుళ్ళు  సమిష్టిగ కలిసి  సృష్టించగలిగే కార్చిచ్చు..



అంతటి కార్చిచ్చు ఎప్పుడు వస్తుందో...
ఎలా వస్తుందో 
నాకు అయితే తెలీదు...
నాకు తెలిసింది వొక్కటే...
అలాంటి కార్చిచ్చు కోసం వేచి చూడడం.. 
దాని కోసం  ముక్కోటి దేవుళ్ళని మనసార ప్రార్థించడం.,