Tuesday, January 26, 2010

నా గణ తంత్ర దినోత్సవ ప్రార్థన



ఓ భగవంతుడా  
నాకు నా దేశము గురించి ఆలోచించే ఆలోచనను ఇవ్వు నా 
కన్నా నా దేశము గొప్పది అనుకొనే సంస్కృతిని ఇవ్వు 
నా ప్రజలకు నేను సేవ చేయాలనే కర్తవ్య భోధన ఇవ్వు  
నా ఇంటి ప్రతిష్ట లాగే .. నా దేశ ప్రతిష్ట కూడా గోప్పదనుకునే భుద్దిని ఇవ్వు  

నా పుట్టిన రోజును నా మిత్రులతో.. ఎలా జరుపుకున్తానో... నా పెళ్లి రోజుని నా కుటుంబంతో ఎలా జరుపుకున్తున్ననో..నా గణ తంత్ర దినోత్సవాన్ని నా దేశ బాగు కోసం జరుపుకునే ఆలోచన ఇవ్వు ..  

గణ తంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర్య దినోత్సవానికీ తేడా తెలుసోవడం నా కనీస ధర్మమూ అని తెలుసుకొనే జ్ఞానం ఇవ్వు.  

రోజు భగవంతున్ని ప్రార్థించి ఈ జీవితం ప్రసాదించినందుకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకుంటానో .. అలాగే ఈ రోజు ఇలా స్వతంత్రంగా గడుపుతున్నదుకు.. కారణమైన స్వతంత్ర సమర యోధులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకునే ఆలోచనను కూడా ఇవ్వు..

రంగు, జాతి, కులము, మతము కంటే మానవత్వము గొప్పది అని ఆలోచన కలిగేలా భావనను ఇవ్వు ..  

సినిమా పోస్టరు చూసి అందులో నటించిన వారి పేరు, వూరు టప టప చెపుతున్న నేను, నా జాతీయ పతాకాన్ని చూసిన వెంటనే అందులో వున్నా రంగుల గురించి, మధ్యలో వున్నా అశోక చక్రము గురించి, అందులో ఎన్ని ఊచలు ఉంటాయో....అదెందుకు అక్కడికి వచ్చిందో కూడా టప టప చెప్పే జ్ఞానము సంపాదించుకునే జ్ఞానం ఇవ్వు .

నా అభిమాన కథ నాయకుడి పేరు , కథానాయకురాలి పేరు, వారి ఇష్ట మైన ప్రదేశం పేరు చెప్పినట్టుగా... నా జాతీయ పక్షి, జాతీయ అట, జాతీయ గీతముల గురించి కూడా చెప్పే జ్ఞానం ఇవ్వు..

నేను గుక్క తిప్పుకోకుండా , స్క్రిప్ట్ చూడకుండా..పాడగల .. ఆ పాటల జాబితాలో నా జాతీయ గీతాన్ని కూడా చేర్చుకునే ఆలోచనని ఇవ్వు..  

నా మనసులో... నా మాతృ స్థానానికి సమానంగా నా దేశ స్థానాన్ని కుదిన్చుకునే స్వభావాన్ని ఇవ్వు.. నా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి... ఒక సీరియల్ ఎపిసోడే టైం సరిపోతుందనే భావనను ఇవ్వు.. కుంటుంబాన్ని ప్రేమించినట్టే , దేశాన్ని కూడా ప్రేమించొచ్చు అనే జ్ఞానం ఇవ్వు..
జాతి, మత, ప్రాంత కోసం కాకుండా దేశము కోసం పోరాడే శక్తిని ఇవ్వు
గాంధీ గారి కలల్ని సాకారం చేసుకునే శక్తిని ఇవ్వు


మీ
వెంకట రత్నం (నివెర)

Wednesday, January 6, 2010

ఒక తెలుగు వాడి ఆత్మ ఘోష

మన అందరికి సుపరిచుతుడు అయిన కే.జే.ఏసుదాసు పాడిన ఒక పాత పాట నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది..


మనుష్యులు..మతాలను సృష్టిస్తే..
మతాలూ దైవాలను సృష్టిశ్తే..
మనుష్యులు , మతాలు మరియు దైవాలు ఈ భూమిని చీల్చి వేశాయి అని
ఈ మూడు వాక్యాలలోని అర్థం , మన మనసుకు హత్తుకునేస్థాయి, ఆలోచింపచేస్తాయి అని అంటే అతిశయోక్తి కాదేమో..
ఈ మూడు వాక్యాలు ఒక రచయిత..ఆవేశం , ఆవేదన మరియు ఆలోచన నుంచి వచ్చాయన్న మాట ముమ్మాటికీ సత్యం..




ఇప్పుడు ఆ చీలిన భూమిని కాస్త మరింత చీల్చాలనే కుట్రను చూసి.. ఎంతో మంది ఆత్మ క్షోభిస్తోంది .. మరి కొంత మందికి శోభనిస్తోంది
ఎందఱో మహానుభావులు రక్తాన్ని చిందించి మన దేశానికి స్వాతంత్ర్యము తెచ్చారు..
మరి ఎందఱో మహానుభావులు.. ప్రాణాల్ని అర్పించి.. మనకు ఒక రాష్ట్రాన్ని సంపాదించి పెట్టారు..
మరి ఇప్పడు కొందరు రాజకీయ కీచకులు.. రాష్ట్రాన్ని తన సొంత లాభం కోసం చీల్చి వేయాలని చూస్తున్నారు..
వారు రగిలించిన చితి మంటల్లో.. అమాయకులు, సామాన్యులు, విద్యార్థులు సమిథలుగా మారుతున్నారు..




ఒక మంచి రాజు వుంటేనే ఒక మంచి రాజ్యం ఏర్పడడం సాధ్యము అవుతుంది..
అందుకే ఇప్పుడూ మనము ఉదాహరణగా రామ రాజ్యము అంటామే కాని... అయోధ్య రాజ్యం అని ఎప్పుడు ఉదాహరణగా వాడము ..
అది ఒక గొప్ప రాజుకు చరిత్ర ఇస్తున్న ప్రాముఖ్యము..
ఇప్పుడు ..ఒక రాజకీయ శకుని ఒక రాష్ట్రాన్ని చీల్చాలని తన సహాయ శక్తుల కృషి చేస్తున్నాడు..
అతని ఆశయము ఉన్నత ఆశయం కావచ్చు.. కాని అతనికి వున్నా అంకితత్వాన్ని ప్రతి ఒక్కరు శంకించ దగ్గ విషయము..




ఎప్పుడో... ఏడు సంవత్సరాల క్రితం రేపే తెలంగాణా అన్నాడు.. తరువాత వారము అన్నాడు.. తరువాత ఇంకా ఎన్నో అన్నాడు..
పిల్లప్పుడు మనము చదువుకున్న బాబోయ్ పులి అన్న కథలో కనీసము అబద్దాల సంఖ్య వుంది..కాని ఈయన చెప్పిన అబద్దాల సంఖ్య మన దగ్గర లేదు.




ఒక్కసారి...అతని ఆశయము కోసము జీవితం పణంగా పెడుతున్నవాళ్ళు...
అతడు.. తన రాజకీయ జీవితంలో..ఇచ్చిన వాగ్ధానాలు ఒక పేపరు మీద రాసుకుని చదివినట్లు అయితే మనకే నిజము అర్థమవుతోంది..
అతడు చేస్తున్న ఈ వికృత చేస్థలు అన్నీ తన రాజకీయ ఉనికి చాటుకోవడానికే అని తెలియడానికి.




ఈ విషయానికి కారకులు రాజకీయ నాయకులే..
కాని సమిధలు మాత్రం.. సామాన్య ప్రజలు ..
ఈ నాయకులు ఇంత సమిష్టిగా ఎప్పుడు అయినా.. ప్రజల విషయము కోసం ఇలా శ్రమించారా...
నేను పుట్టి ఇప్పడికి ముప్పై సంవతరాలు అయింది..
నాకు బుద్హి వచ్చి ఇప్పడికి ఇరవై ఇదు సంవత్సరాలు అయింది..
నాకు ఇటువంటి సంఘటనా ఒక్కటి కూడా కూడా గుర్తులేదు..
చేసినా ఆ విషయము గంట కొట్టినంత సమయము కూడా వుండదు..




మనకు ఇవన్నీ తెలియని విషయాలు కాదు..
మనందరు..రొజూ చర్చించుకునే విషయాలే ఇవి..
మరి మనమెందుకు వారి కుసంస్కార ఆలోచనలకు సమిధలు కావాలి..




ఇప్పుడు ఒక విషయాన్నీ గమనించాలి..
మన నాయకులూ చిత్త శుద్దితో కృషి చేస్తే...ఏది అయిన సాధించగలరు..అన్న మాట సుస్పష్టం.
నూట యాభై సభ్యులు..రాజీనామా ఇస్తే.. విడదీస్తామన్న రాష్ట్రాన్ని.. విడదీయమని చెప్పారు..మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు..
ఇదే నూట యాభై సభులు..రాజీనామా చేస్తామని చెప్తే.. మనకు ఎందుకు కేంద్రం కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయదు..చెప్పండి..
వాళ్ళు చెయ్యరు.. అది అంతే..
ఈ తప్పుల తర్పీదు ఇస్తున్న వారము మనమే కదా








ప్రియమైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా... నాది ఒక విన్నపము..
దయ చేసి..మీరు లేదా మీ పిల్లలని ఇందులో సమిధలు కాకుండా చూసుకోండి..
ఈ సారి.. ఎప్పుడు అయినా మీ నాయకుడు ఇంటి దగ్గరకు వస్తే.. మీ గ్రామము లేదా నియోజకవర్గ అభివృద్ధి కోసము రాజీనామా చేయమని చెప్పండి..
ఒక్కరు కూడా చెయ్యరు.. మరి వారి కుట్రలో మనము ఎందుకు సమిధలు కావాలి..
అని ఈ పోరాటములో పాల్గొన్నవారు, పాల్గొనాలి అని అనుకుంటున్న వారు ఆలోచించాలి




కలిసి వున్నప్పుడు ఏమీ చేయని ఈ నాయకులూ విడిపోయిన తరువాత ఎందుకు చేస్తారు ?
ప్రజా సేవకు ప్రత్యేక రాష్ట్రానికి పొంతన ఏంటి ?
ప్రత్యేక రాష్ట్రం వల్ల దేశములోని ముఖ్య మంత్రుల సంఖ్యా పెరుగుతుంది
మంత్రుల సంఖ్యా పెరుగుతుంది
అంతే కాని ప్రజలకు ఏమి ఒరుగుతుంది?
ఇలా అంటున్నాను అని నేను సమైఖ్య వాదిని కాదు.. ఈ సమైఖ్య వాదన కూడా రాజకీయ నాయకుల స్వార్థమే..
విద్యార్థుల ముసుగులో గుండాలు చేస్తున్న అక్రమాల్ని కనుక్కోవడం విద్యార్థుల విధే




ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలంటే కొన్ని లక్షల కోట్లు అవసరం..
ఎందుకు.. ఆ డబ్బులు అంతా పాలనా వ్యవస్థను స్థాపించడనికే ..
అదే లక్షల కోట్లు రాష్ట్ర భవిష్యత్తుకు ఖర్చు పెట్ట గలిగితే మన రాష్ట్రం తప్పనిసరిగా స్వర్ణ రాష్ట్రం గా మారుతుంది..
లక్షలకొద్దీ ఉద్యోగాలు సృష్టింపబడతాయి




మనకు కావలసినది ప్రత్యేక తెలంగాణానో , ప్రత్యేక ఆంధ్రనో లేక ప్రత్యేక గ్రేటర్ రాయలసీమనో కాదు..
మనకు నిక్కచ్చిగా కావలసినది..
ప్రత్యేక నాయకులు..
డబ్బు కోసం కాకుండా సేవ కోసం గ్రామాలకు బస్సులు నడిపే ఆర్ టి సి బస్సులను కాల్చని , ప్రజల ఆస్తులని ద్వంశం చేయని ప్రత్యేక ఆందోళనకారులు...
మన భవిష్యత్తు నాశనం అవుతున్న.. పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నా , ఉద్యోగాలలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని నాయకుల వెంబడి వుండే విద్యార్థి నాయకులు




చివరికి ఒక చిన్న మాట మీరు ఎప్పుడుయినా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి అభి వృద్ధి చెందిన దేశాల పటాలు చూసారా..చూడలేదంటే ఒక సారి పటాలను గమనించండి .. ఆ దేశములలోని రాష్ట్రాల బోర్డర్లు గమనించండి..అంత చెస్ బోఅర్డు లాగ వుంటాయి.. ఈ చీలికలు పాలనా వ్యవస్థను సరళం చేయడానికే కాని .. జటిలం చేయడానికి కాదు..




జై తెలుగు తల్లి..